ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు

ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...

రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...

మోహన్ లాల్ పెరటి తోట చూశారా!

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్‌డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...

ఉచితంగా దేశీ విత్తనాలు

సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...

సేంద్రియ సాగు కోసం పాలిటెక్నిక్ కాలేజ్

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20 శనివారం శాసనమండలిలో ఎస్ సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు...

ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం...

కంపోస్టుతో కోటి రూపాయలు!

తనకి ఉన్న భూమి కేవలం ఎకరం మాత్రమే. కానీ సనా ఖాన్ అక్కడ ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తారు. ఇవాళ తన వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అసలు అదెలా సాధ్యపడిందో ఇప్పుడు చదవండి. సేంద్రియ ఎరువును తయారు చేయాలనే...

సహజ పద్ధతిలో మిరప రక్షణ

మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు క్రిమి కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువనే చెప్పాలి. మిర్చి పంట సాగులో సస్యరక్షణ...

ఓ యువ జంట..ప్యూర్ ఆర్గానిక్ పంట

వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ...

Follow us

Latest news