అది ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని అంకర్లపూడి గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి హరిత వ్యవసాయంవైపు సాగారు. జీవామృత విధానంలో సేద్యం చేస్తున్నారు. హరిత ఇప్పుడు పరిసర గ్రామాల్లో (ZBNF) ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలిచారు. కూరగాయలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆమె వరి సాగు చేశారు. హెచ్చు దిగుబడి సాధించి ప్రకృతి సేద్యం వైపు మళ్లేందుకు యువతకు ప్రేరణనిస్తున్నారు.