వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతల కాలం నుంచీ వస్తున్నదే. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలంటారు కదా! అలా మారి చూపిస్తున్నారు కేరళకు చెందిన కొందరు మహిళలు. టెర్రస్ మీద సాధారణంగా ఎలాంటి పంటలు పండిస్తారు? ఏవో కొన్ని మనకు కావలసిన ఆకుకూరలు, మరి కొన్ని కాయగూరలు, మరికొన్ని తీగజాతి కాయలు, ఇంకొన్ని పండ్ల జాతులు.. ఇంతే కదా! అయితే.. మన కేరళ మహిళలు టెర్రస్ మీదే తమ తమ విధానాల్లో సహజసిద్ధంగా వరిపంట సాగుచేస్తూ.. అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు. అది కూడా సహజ పంటల విధానంలో వారు వరి ధాన్యం పండించడం మరింత సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించక మానదు మరి. టెర్రస్ మీద కుండీల్లో, మట్టి సంచుల్లో, ఖాళీ వాటర్ బాటిళ్లలో వరిమొక్కలు నాటి, చక్కగా ధాన్యం పండిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ మహిళలు టెర్రస్ మీద ధాన్యం పండించే విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తిరువనంతపురం సమీపంలోని శ్రీకారయం గృహిణి అంబిక ఐదేళ్ల క్రితమే ఐదేళ్ల క్రితం తమ టెర్రస్ మీద ప్లాస్టిక్ కుండీల్లో ధాన్యం పండించింది. అంబిక చేసిన ప్రయోగం ఆ చుట్టుపక్కల అందరినీ ఆకర్షించింది. అంబిక తమ టెర్రస్ మీద 100 ప్లాస్టిక్ కుండీలు పెట్టి, వాటిలో బెల్లం, ఆవుపేడ, గోమూత్రం, ఆకుపచ్చ కసువు, కోడిగుడ్ల సొనలతో తాను తయారు చేసుకున్న ‘హృదయామృతం’ నింపింది. వరిమొక్కలను చీడ పీడలు ఆశించకుండా ఉండేందుకు వేపగింజల పొడిని వాడింది. ఆ తర్వాత ఒక్కో కుండీలో మూడు లేదా నాలుగు ‘ఉమ’ రకం వరిమొక్కలు నాటింది. అలా నాటిన వరిమొక్కలు 110 రోజులో చక్కని పంట ఇచ్చాయి. అప్పుడు అంబిక పొందిన ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి. తమ మిద్దెపై వయ్యారంగా వంగి ఉన్న వరి కంకుల్ని చూసుకుని రోజూ మురిసిపోయేది. ఆ పంట కూడా ప్రతిరోజూ తాము తినే బియ్యంగా మారినప్పుడు అంబిక హృదయం మరింత సంతోషంతో నిండిపోయింది.
మిద్దె మీదే బోలెడంత ధాన్యం పండించి, సెభాష్ అనిపించుకున్న మరో మహిళ సుగంధా దేవి. ఆమె ప్రతి ఏటా తమ టెర్రస్ మీద 40 కిలోల బియ్యం దిగుబడి వచ్చేలా ధాన్యం పండిస్తోంది. అలా పదేళ్లుగా ఈ 56 ఏళ్ల సుగంధాదేవి టెర్రస్ మీద వరిధాన్యం పంట పండిస్తోంది. అలా ఇప్పుడామె మిద్దె మీద ధాన్యం పండించడంలో నిష్ణాతురాలు అయింది. తమ మిద్దె మీదే కాకుండా ఇప్పుడామె తమ కుమార్తె ఇంటి మీద కూడా వరిసాగు చేస్తోంది. సుగంధా దేవి ఏడాదికి ఒకసారి మాత్రమే అది కూడా వర్షాకాలం మాత్రమే వరి పంట పండిస్తుంది. జూన్ నుంచి వరి సాగు ప్రారంభించి, సెప్టెంబర్ మధ్య వరకు సుగంధాదేవి వరి సాగు చేస్తుంది. నిజానికి కేరళలో వ్యవసాయాన్ని, టెర్రస్ తోటల ప్రోత్సాహానికి గ్రామ పంచాయతీల్లో ఎరువు, మట్టి సంచులు సబ్సిడీ మీద అమ్ముతుంటారు. అలా అమ్మే సంచులను ప్రతి సంవత్సరం సుగంధాదేవి కొని, వాటిలో వరిధాన్యం పండిస్తుంది. సుగంధాదేవి టెర్రస్పై వరి పండించే విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
సహజ పంటల సాగు విధానంలో టెర్రస్లపై వరి ధాన్యం పండిస్తున్న ఈ ముగ్గురు మహిళలూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో అతిశయం ఉండదు.