క్రమశిక్షణ గల పోలీస్ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్ పీపుల్స్ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ అధికారి. పోలీస్ ర్యాంకుతో ఇంటి పేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనే వాసగిరి వెంకట లక్ష్మినారాయణ (జేడీ లక్ష్మీనారాయణ).
కౌలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి జేడీ లక్ష్మీనారాయణకు చక్కని అవగాహన ఉంది. అయిన సరే కౌలు రైతుల కష్టాలేంటో స్వయంగా అనుభవించి తెలుసుకునేందుకు తాజాగా కౌలురైతు అవతారం ఎత్తారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇటీవలే జరిగిన ఏరువాక పున్నమి రోజున జేడీ లక్ష్మీనారాయణ భూమికి పూజ చేసి ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. జులై 29 ఉదయం ఆ పొలంలో లక్ష్మీనారాయణ వరినాట్లు వేశారు.
చూశారు కదా వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతు అవతారం.. ఉద్యోగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన ఇప్పుడు దేశంలో యువ రైతుల్ని పెంచే కృషీవలుడయ్యారు.