హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం అని ఆమె తెలిపారు. నిర్మలా సీతారామన్ 2022 ఫిబ్రవరి 1న లోక్ సభలో 2022- 23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నేచురల్ ఫార్మింగ్ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.
మొదటి దశలో భాగంగా గంగానది పరీవాహక ప్రాంతాల్లోని ఐదు కిలోమీటర్ల లోపు వ్యవసాయ భూములు ఉన్న రైతులతో పైలెట్ ప్రాజెక్టుగా సేంద్రీయ వ్యవసాయం చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సేంద్రీయ వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని సిలబస్ లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కేంద్ర మంత్రి వ్యవసాయ వర్శిటీల అధికారులను కోరారు.