ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం ఈ మేరకు ఆమోదించింది. ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఏడాది కాలానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కోటిన్నర రూపాయలు కేటాయించాలని ఏపీ కేబినెట్ భేటీ నిర్ణయించింది.